ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు

Published: Monday October 17, 2022
 మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 16 అక్టోబర్ ప్రజా పాలన : ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డుకు చెందిన అనంతగిరిపల్లిలో వార్డు కౌన్సిలర్ అంగోత్ దేవి రెడ్యానాయక్ ఆధ్వర్యంలో అమ్మ లాబ్స్, యజ్ఞ సంస్థ సౌజన్యంతో మెగాహెల్త్ క్యాంప్ ను స్థానిక స్కూల్ లో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్బంగా ప్రజలకు రక్త పరీక్షలు, బీపీ, థైరాయిడ్, షుగర్ టెస్టులతో పాటు రోగులకు  ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ద సుధాకర్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోలేక అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిన్న ఆహారాన్ని అరిగించేందుకు తగిన శారీరక శ్రమ చేయలేక అనేక జబ్బులకు మూల కారణమవుతున్నారు. మొబైల్ ఫోన్లు టీవీలకు అతుక్కుపోవడంతో ఊబకాయలుగా తయారవుతారని హెచ్చరించారు. అనంతరం మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసిన అమ్మ లాబ్స్ హాస్పిటల్ వారిని అభినందించారు. ఈ మెడికల్ క్యాంపులో సుధాకర్ రెడ్డి కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప కౌన్సిలర్ జైదుపల్లి మురళి నాయకులు చాపల శ్రీనివాస్ ముదిరాజ్, ఎండీ రహీం, విజయ్ కుమార్, ఆనంద్, చంద్రశేఖర్, అనంతయ్య, లక్ష్మణ్, భాగయ్య,తదితరులు పాల్గొన్నారు.