మండలంలో క్రీడా ప్రాంగణ స్థలాన్ని సందర్శించిన ఎంపీడీవో

Published: Wednesday August 24, 2022

బోనకల్ ఆగస్టు 23 ప్రజా పాలన ప్రతినిధి: ఐదో విడత పల్లె ప్రగతిలో  భాగంగా మండలంలోని గ్రామీణ క్రీడా ప్రాంగణాల స్థలాన్ని మంగళవారం  మండల ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ సందర్శించి పరిశీలించారు.అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ క్రీడా ప్రాంగణాలను త్వరగా పూర్తి చేయాలని  క్రీడలకు ప్రాదాన్యం కల్పించే దిశగా ప్రభుత్వం క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందనీ, ఈ నేపథ్యంలో మండల పరిధిలో గోవిందాపురం ఎల్, లక్ష్మీపురం గ్రామ పంచాయతీల క్రీడా ప్రాంగణాల కొరకు స్థలాన్ని సందర్శించినారు. క్రీడా ప్రాంగాణాల ఏర్పాటు వలన పిల్లలకు, యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేటి యువతకు క్రీడా ప్రాంగాణాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడాప్రాంగణంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేయాలని ఆయా గ్రామాల సర్పంచులను ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను, హరిత హారం పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, గోవిందపురం ఎల్ సర్పంచ్ ఉమ్మినేని బాబు, లక్ష్మీపురం సర్పంచ్ దారెల్లి నరసమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శులు బానోతు శివ, నరసింహారావు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.