ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

Published: Thursday November 03, 2022

 జన్నారం, నవంబర్ 02, ప్రజాపాలన:  హుజూరాబాద్ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై టిఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బిజెపి బిజెవైఎం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గోలిచంద్, మంచిర్యాల జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అజ్మీర బద్రి నాయక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్, మోర్చా మండల అధ్యక్షులు దూర తిరుపతి,  బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నంద వేణి పవన్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ములుగు ప్రవీణ్, శక్తి కేంద్ర ఇన్చార్జి బుర్ర గడ్డ జగన్, జిల్లా నాయకులు కొండపల్లి మహేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు రత్నం, రాజ మురళి, బూత్ అధ్యక్షుడు సాయి నిఖిల్, గూడ గంగాధర్, మండల ఐటీ సెల్ కో- కన్వీనర్ కట్ల నాగరాజు  తదితరులు పాల్గొన్నారు.