అకాల వర్షాలకి ఇల్లు కూలిపోయి దీన స్థితిలో పడిన కుటుంబం

Published: Monday July 18, 2022

కోరుట్ల, జూలై 17 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తుర్తి గ్రామంలో గత వారం రోజులనుంచి కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా కూలిపోయిందని  బోరె.ప్రభాకర్ దంపతులు బోరున విలపించారు. భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా కూలిపోయి తీవ్ర నష్టం జరిగిందని, దయచేసి ప్రభుత్వం ఆదుకొని  డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని  ప్రభుత్వానికి భార్య భర్తలు విజ్ఞప్తి  చేశారు. చిన్న పిల్లలతో మోకాలు లోతు నీళ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతూ వారం రోజులు గడిపామని, కూలిన ఇంట్లో మోకాలు లోతు నీళ్లలో ఉంటూ, తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి ఉందని, అధికారులు నాయకులు ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఇప్పటికైన  అధికారులు, నాయకులు స్పందించి డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.