రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Published: Monday May 24, 2021
రాయికల్, మే 23 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండల ధర్మాజీపేట్ క్లస్టర్ గ్రామ రైతు వేదిక భవనాన్ని ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతు వేదికలు రైతులకు చాలా ఉపయోగపడతాయని వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం ధర్మాజీపేట్ ఎస్టీ నాయకపు గూడెంలో మండల పరిషత్ నిధులతో వేసిన బోర్ ని ప్రారంభించారు.  అనంతరం బోర్ నీటిని తాగారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి, జడ్పీటీసీ అశ్విని జాదవ్, ఏ. ఎం.సి చైర్మన్ గన్నే రాజారెడ్డి, వైస్ చైర్మన్ కొల్లూరి వేణు, కో అప్సన్ మెంబర్ మొకీద్, ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా, మండల అధ్యక్షులు దొంతి నాగరాజు, సురేంధర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మారంపెల్లి స్నేహ హరీష్, రాగి సాగరిక, కోల సుమలత, నందు, రాజమౌళి, భూక్య జమున, ఎంపీటీసీ చెక్కబండి పద్మ, ఉపసర్పంచ్లు వెంకటేష్, ముజ్జు, ఆకుల మల్లేశం, సంతోష్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.