ఎమ్మేల్యే క్వార్టర్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మేల్యే డా. సంజయ్
Published: Friday January 27, 2023
జగిత్యాల, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి): 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మేల్యే క్వార్టర్స్ లో జాతీయ జెండాను జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఛైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్, బి అర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: