రావినూతల పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్

Published: Friday June 17, 2022

బోనకల్, జూన్ 16 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలోని ఎస్ కే ఎన్ పి ఎం మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల నందు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మంజూరు అయిన 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న మరుగుదొడ్లకు రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, ఎస్ఎంసి చైర్మన్ తాళ్లూరి రామారావు, పాఠశాల సిబ్బంది , గ్రామ పెద్దల సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపేందర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధులతో 10 లక్షలు రూపాయలతో అదనపు గదులు సమకూర్చడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ బోయినపల్లి కొండలు, పంచాయతీ రాజ్ ఏఈ నవీన్ కుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, యుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతమనేని వెంకటేశ్వరావు, చేబ్రోలు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.