మేడ్చల్ జిల్లా ప్రజాపాలన ప్రతినిధి ఘట్కేసర్:
Published: Saturday August 27, 2022
ఘట్కేసర్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడు నరసింహ మరణించగా అతని పార్థివ దేహం పై పుష్ప పూలమాలవేసి నివాళులర్పించాన ఘట్కేసర్ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ * పలుగుల మాధవరెడ్డిగారు,* స్థానిక వార్డు కౌన్సిలర్ *బండారి ఆంజనేయులుగౌడ్ గారు,
ఈ సంధర్భంగా వైస్ చైర్మన్ * మాధవ రెడ్డి మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ చెందిన నరసింహ అనే పారిశుద్ధ్య కార్మికుడు విధులకు హాజరు అయ్యే సమయంలో గుర్తు తెలియని ద్విచక్రవాహనం నరసింహ ను డి కొట్టగా వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఘట్కేసర్ మున్సిపాలిటీ లో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడికి ఇలా అవడం చాలా బాధాకరమని, వారికి మా తరపున మరియు మున్సిపాలిటీ పాలక వర్గం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని తెలుపు వారికి రావాల్సిన ESI,PF డబ్బులు అతి త్వరలో అందేలా చూస్తామని తెలిపారు....
ఈ కార్యక్రమంలో 13 వ వార్డు సభ్యుల ఎస్ కె జహంగీర్ , యూనియన్ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు....
Share this on your social network: