రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి..

Published: Tuesday January 24, 2023
 రైతు సంఘం అధ్యక్షులు పోతినేని 
తల్లాడ, జనవరి 23 (ప్రజా పాలన న్యూస్) :కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, జనవరి 26న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు దేశంలో జిల్లా కేంద్రాల్లో జరిగే రైతులు  ర్యాలీలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పిలుపునిచ్చారు. సోమవారం తల్లాడ మండలం కుర్నవల్లిలో మండల రైతు సంఘ కార్యదర్శి నల్లమోతు మోహన్ రావు  అధ్యక్షతన తల్లాడ, కల్లూరు మండలాల రైతు సదస్సు జరిగింది ఈ సదస్సులో వారు మాట్లాడుతూ దేశంలో అన్నం పెట్టే రైతు అప్పుల్లో కురకపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని,  రైతులందరూ ఐక్యంగా పోరాడాలన్నారు.  ఈ కార్యక్రమంలో నున్నా నాగేశ్వరరావు, తాతా భాస్కరరావు శీలం పకీరమ్మ, శీలం సత్యనారాయణ రెడ్డి, అంజయ్య, అయినాల రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.