ప్రజల ఆరోగ్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయానిధి

Published: Thursday October 07, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 06 అక్టోబర్ ప్రజాపాలన : పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో చేయూతనందిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డెెగావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ప్రజారోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పుష్కలంగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చులకోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయానిధి ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుుప్తా, పిఎసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, హరిదాస్ పల్లి పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్ నాయక్, పార్టీ మాజీ అధ్యక్షులు కోస్నం వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి అంజయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ రాములు, రైతు సంఘం అధ్యక్షులు లక్ష్మయ్య, హరిదాస్ పల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ కృష్ణ, సర్పంచులు చంద్రమౌళి, అమర్నాథ్, ప్రభాకర్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ చంద్రయ్య, పార్టీ మండల ఉపాధ్యక్షులు అనంతయ్య, మండల ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు  విజయ్ కుమార్, నాయకులు శివ కుమార్, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.