నూతనకల్లులో జాతీయ జెండాను ఎగురవేసిన సర్పంచ్ తూము శ్రీనివాసరావు..
Published: Thursday January 27, 2022
తల్లాడ, జనవరి 26 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామములో బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచి తూము శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అదే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చేకు సీతారాములు, మాజీ సర్పంచ్ శెట్టిపల్లి లక్ష్మణరావు, వైరా మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి గ్రామ కన్వీనర్ తమ్మినేని పాపారావు, ఏఈవో త్రివేణి, సెక్రెటరీ ఇజాజ్, అత్తులూరి శ్రీనివాస్, విద్యా కమిటీ చైర్మన్ శెట్టిపల్లి చంద్రయ్య, కల్యాణపు వెంకటయ్య, వార్డు నెంబర్ లు రుక్మిని, లోకేశ్వరరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Share this on your social network: