ఎస్ ఎల్ ఎన్ ఎస్ కాలనీలో సీసీ రోడ్డు అభివృద్ధి పనులు

Published: Friday August 13, 2021
బాలాపూర్: ఆగస్టు12, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదేశానుసారం గా కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని బిసి సెల్ అధ్యక్షులు దిండు భూపేష్ గౌడ్ పేర్కొన్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 36వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ మాజీ ఎంపీటీసీ బీసీ సెల్ అధ్యక్షులు దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ ఎల్ ఎన్ ఎస్ కాలనీలో ఆనంద్ ఇంటి ముందు నుండి కే కే డెంటల్ ఇంటి వరకు సి సి రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా భూపేష్ గౌడ్ మాట్లాడుతూ.... మీర్ పేట్ నగరపాలక సంస్థ లోని ఇతర డివిజన్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, తమ డివిజన్ కు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. కో ఆప్షన్ సభ్యులు నిధుల నుండి సి.సి రోడ్డు నిర్మాణ పనులను  చెయ్యాలని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం గా ప్రతి కాలనీ అభివృద్ధి జరుగుతుందిని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 32 వ డివిజన్ కార్పొరేటర్ వేముల నరసింహ్మ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.