సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి : సిపిఎం యాచారం మండల కార్యదర్శి ఆల్లంపల్లి నర

Published: Monday November 22, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి : సీపీఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంల్ లో జనవరి 22 నుంచి  25 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని అన్నారు. ప్రజా సమస్యలపై సిపిఐ(ఎం) రాజీ లేని పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. ఈ మహాసభలకు యాచారం మండల కేంద్రంలో ఉన్న దాతలు, వ్యాపారస్తులు, ప్రజలు విరాళాలు ఇచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయగలరని అన్నారు. సిపిఎం ఎల్లప్పుడు నిరుపేదలు, కార్మికులు, కర్షకులు, పేద ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని గుర్తుచేశారు. పెద్ద మొత్తంలో  మండల కమిటీ సభ్యులు మండల పార్టీ కార్యకర్తలు, మహాసభలను విజయవంతం చేయగలరని కోరారు.