సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి : సిపిఎం యాచారం మండల కార్యదర్శి ఆల్లంపల్లి నర
Published: Monday November 22, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి : సీపీఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంల్ లో జనవరి 22 నుంచి 25 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని అన్నారు. ప్రజా సమస్యలపై సిపిఐ(ఎం) రాజీ లేని పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. ఈ మహాసభలకు యాచారం మండల కేంద్రంలో ఉన్న దాతలు, వ్యాపారస్తులు, ప్రజలు విరాళాలు ఇచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయగలరని అన్నారు. సిపిఎం ఎల్లప్పుడు నిరుపేదలు, కార్మికులు, కర్షకులు, పేద ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని గుర్తుచేశారు. పెద్ద మొత్తంలో మండల కమిటీ సభ్యులు మండల పార్టీ కార్యకర్తలు, మహాసభలను విజయవంతం చేయగలరని కోరారు.
Share this on your social network: