సౌభ్రాతృత్వానికి ప్రతీక ఇఫ్తార్ విందు

Published: Wednesday April 19, 2023
కాంగ్రెస్ పార్టీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 18 ఏప్రిల్ ప్రజా పాలన : పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్షతో నిబద్ధులవుతారని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సత్య భారతి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పవిత్ర మాసంగా భావించే ప్రతి ముస్లిం పచ్చి నీళ్ళు ముట్టకుండా ఉపవాస దీక్ష చేపడతారని స్పష్టం చేశారు. ప్రతి ముస్లిం తనకు కలిగిన ఆదాయంలో కొంత భాగాన్ని పేద నిరుపేద ముస్లిం కుటుంబాలకు దానధర్మాలు చేయడంలో ముందుంటారని కొనియాడారు. పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని శుభాశీస్సులు తెలిపారు. ప్రతి పండుగ ఒక విశిష్ట సందేశాన్ని సమాజానికి అందిస్తుందని గుర్తు చేశారు. ప్రతి పండుగ ఐకమత్యం సోదర భావం సమన్వయం వంటి లక్షణాలను అందిపుచ్చుకుంటుందని వెల్లడించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషదాయకం ఉంటుందని అన్నారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో చామల రఘుపతి రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నారెడ్డి తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.