బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్ పాయ్ జయంతి వేడుకలు

Published: Monday December 26, 2022
జన్నారం, డిసెంబర్ 25, ప్రజాపాలన: భారత దేశ మాజీ ప్రధాని వాజ్ పాయ్ జయంతి వేడుకలను ఆదివారం మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను కొనియాడారు. భారతదేశానికి వాజ్ పాయ్ చేసిన సేవలు మరువలేవని అద్భుత నాయకత్వం అందించారని మండల బిజెపి పార్టీ నాయకులు అన్నారు. దేశానికి మౌలిక సౌకర్యాల కల్పన, విద్య, విదేశీ విధానంలో తనదైన ముద్ర వేశారని మండల బిజెపి పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జన్నారం మండల అధ్యక్షుడు గోలిచంద్, బిజెపి మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్, పట్టణ అధ్యక్షులు రాగుల సూర్యం, వీరాచారి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు రత్నం, రాజమౌళి, ఆకుల శివ, చిట్టి బాబు, గంగాధర్ గంగమల్లు, గోడ తిరుపతి, ముదేళ్ల శంకర్. బురగడ్డ జగన్. తదితరులు పాల్గొన్నారు