మహాశివరాత్రికి ముస్తాబవుతున్న కోటిలింగాల: ఆలయ చైర్మన్ పదిరె నారాయణరావు
Published: Friday March 05, 2021
వెల్గటూర్, మార్చి 04 (ప్రజాపాలన ప్రతినిధి): వెల్గటూర్ మండలం లోని కోటిలింగాల గ్రామంలో గల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర సంధర్బంగా ఆలయం ముస్తాబు అవుతున్నట్లు ఆలయ చైర్మన్ పదిరేనారాయణ రావు తెలిపారు. రాయపట్నం కరీంనగర్ రహదారిని ఆనుకుని ఉన్న కోటిలింగాల ఆలయ కమాన్ మరియు ఆలయానికి రంగులు వేయడం పూర్తి కావాచ్చినట్లుఆయన తెలియ జేశారు. ఆలయానికి నిరంతరాయం విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు అదేవిధంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు.
Share this on your social network: