టీఎస్ యుటిఎఫ్ జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
బోనకల్ ,నవంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి: ఈనెల 20వ తేదీన వైరా పట్టణంలో జరిగే టీఎస్ యుటిఎఫ్ 5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల శాఖ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ , మండల అధ్యక్షులు బి.ప్రీతం మాట్లాడుతూ ఈ మహాసభలకు గౌరవ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలియజేశారు. మహాసభలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం అవలంబించవలసిన పోరాటాలకు సంబంధించి అనేక తీర్మానాలు చేయడం జరుగుతుందని. అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు అనేక తీర్మానాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ మహాసభలు అత్యధిక మంది ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఉపాధ్యాయ లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు బి. ప్రీతం ఉపాధ్యక్షులు చంద్రప్రసాద్, సధాబాబు, కే శ్రీనివాసరావు, రాఘవాచార్యులు, టి.లక్ష్మి,,జి నిర్మల, పద్మలత, జ్ఞానేశ్వర్ చారి, శ్రీలక్ష్మి,వెంకటలక్ష్మి, రామకృష్ణమ్మ, నరసింహారావు, గోపాల్ రావు, చిన్న రంగారావు తదితరులుపాల్గొన్నారు.
Share this on your social network: