కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్

Published: Monday July 26, 2021
మధిర, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ఈరోజు మధిర టౌన్ ఆజాద్ రోడ్డులోని ప్రముఖ సామాజిక సేవకుడు లంకా కొండయ్య బృందం ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారి ప్రోత్సాహంతో MP జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రోగ్రాంలో భాగంగా రెండవరోజు మొక్కలు నాటే కార్యక్రమం మేము సైతం మిత్రమoడలితో పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఆజాద్ రోడ్డులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాస్టర్ మహబూబ్ నగర్ కు చెందిన తోట సల్మాన్ రాజు హెప్సిబా దంపతులు చేతుల మీదుగా మొక్కలు నాటారు. అదేవిధంగా ప్రముఖ హోమియో సేవకులు ఉపాధ్యాయులు మేడేపల్లి శ్రీనివాసరావు మరియు వారి పిల్లలు మేడేపల్లి ప్రణిత, సాయి రోహన్, లంకా కరుణ లియోనా, anm లంకా సంధ్య, కొండయ్యల చేతులు మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కొండయ్య మాట్లాడుతూ మొక్కలే మానవాళి మనుగడకు ఆధారం. కావున ప్రతి ఒక్కరు మొక్కలు నాటటం అలవాటుగా చేసుకోవాలని సూచించారు. mp జోగిన పల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా చాలంజ్  ప్రోగ్రాం మొదటి నుండీ ఏదో ఒక ప్రాంతంలో మొక్కలు నాటటం అభినందనియయం అని కొండయ్య అన్నారు.