ఈ నెల 30 వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలి

Published: Thursday May 20, 2021

జిన్నారం, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రం ప్రభుత్వం  అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల 30వ తేదీ దాకా పొడిగించడంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామంలో యధావిధిగా లాక్ డౌన్ కొనసాగుతుందనీ, దీనికి ప్రజలందరూ సహరించాలని గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆమె మాట్లాడుతూ గ్రామస్తులు అందరూ ఇప్పటివరకు సహకరించిన విధంగా మే 30వ తేదీ వరకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలు దుకాణాల వద్ద గుమ్మికుండా సామగ్రిని కొనుగోలు చేసుకోగలరనీ సూచించారు. అదేవిధంగా కొవిడ్ 19 నిబంధన ల్లో భాగంగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె కోరారు.