రైతుకు భరోసా తెలంగాణ ప్రభుత్వం బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Published: Friday December 02, 2022

బూర్గంపాడు (ప్రజాపాలన.)

రైతును రాజును చేసిన రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రమేనని రైతుల కోసం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే రైతుబంధు తీసుకొచ్చినటువంటి రైతు సేవకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అలాంటిది దేశంలో మోడీ హాయంలో రైతు మరణాలు విపరీతంగా పెరిగాయని రైతుల దగ్గర్నుంచి మేము ధాన్యం కొనము అని చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సీజన్లో రైతులు పండించిన పంటను తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉండి మరి కొనుగోలు చేస్తుందని రైతుల కోసం రైతు బీమా, 24 గంటల కరెంటు తీసుకువచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల యొక్క ఆకలి చావులు తప్పాయని అది ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యమని వారు అన్నారు. ఒక రైతుబందే కాకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మీ అంటే పథకాలు దేశానికే ఆదర్శమని వారి ఈ సందర్భంగా తెలిపారు.