సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Published: Friday November 26, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి : సీపీఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ మండల కమిటీ సభ్యులు కావలి జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంల్ లో జనవరి 22 నుంచి 25 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా యాచారం మండల పరిధిలో ఉన్న కొత్తపల్లి గ్రామంలో ఇంటింటికి సిపిఎం విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఆదరిస్తూ విరాళాలు సేకరిస్తున్నారు అని అన్నారు. ప్రజా సమస్యలపై సిపిఐ(ఎం) రాజీ లేని పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. గ్రామంలో దాతలు, వ్యాపారస్తులు, ప్రజలు, విరాళాలు ఇచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయగలరని అన్నారు. సిపిఎం ఎల్లప్పుడు నిరుపేదలు, కార్మికులు, కర్షకులు, పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం నిర్వహిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో.. శాఖా కార్యదర్శులు కృష్ణ, జంగయ్య, పార్టీ శాఖ సభ్యులు శ్రీను, కృష్ణ, శివ,యాదయ్య, వెంకటేష్, పరమేష్, సైదులు, విప్లవ కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.