మున్సిపల్ జనరల్ సెక్రెటరీ మడుపు వేణుగోపాలరావుకు సన్మానం
Published: Wednesday September 22, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : సోమవారం జరిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మున్సిపల్ అధ్యక్ష, కార్యదర్శి నియామక ఎన్నికల్లో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు మడుపు వేణుగోపాల్ రావు ఎన్నికైన సందర్భంగా అదే గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఇబ్రహీంపట్నంలో వేణుగోపాల్ రావుకు పార్టీలకతీతంగా ఆయనకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రావు మాట్లాడుతూ పార్టీ నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, నా నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. సత్కరించిన వారిలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దొంతర మోని రాములు, గ్రామ అధ్యక్షుడు పి మహేందర్. దశరథ, మహేష్, శివ, భాస్కర్ తదితరులు ఉన్నారు.
Share this on your social network: