ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

Published: Wednesday December 15, 2021
కాగజ్ నగర్ డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి: కాగజ్ నగర్ పట్టణంలో ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నామని పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున 48 మందిని పరీక్షించగా అందులో 21 మందికి ఆపరేషన్ అవసరమని వారికి విడతల వారిగా ఆపరేషన్ నిర్వహిస్తామని, అలాగే ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించ బడునని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఫౌండేషన్ అధ్యక్షులు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.