ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం చేయండి

Published: Wednesday October 27, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణలో ప్రజలకు ఎదుర వుతున్న సమస్యలు తెలుసుకోవటానికి ప్రజా ప్రస్థానం పేర చేవెళ్ల నుండి ఈ నెల 20వ తేది రోజు మొదలు పెట్టిన పాదయాత్ర చేవెళ్ల పార్లమెంట్ ప్రాంతం ముగించు కొని 28వ తేది గురువారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలిమినేడు గ్రామంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలు అవుతుందని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు మాధగోని జంగయ్య గౌడ్ అన్నారు. నియోజకవర్గ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. కొలుగురి అమృత సాగర్ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ ఇరుగు సునీల్ తో కలిసి బారి ఎత్తున వైయస్ షర్మిలకు ఘన స్వాగతం పలకడం జరుగుతుందని, అనంతరం ఎలిమినేడు గ్రామంలో ని వైయస్సార్ విగ్రహం దగ్గర వైయస్ షర్మిల ప్రజలతో రచ్చ బండ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. అదే రోజు కప్పపహాడ్ గ్రామానికి చేరుకుని రాత్రి బస చేస్తారని అన్నారు. 28వతేది గురువారం ఉదయం కప్పపహాడ్ గ్రామం నుండి పాదయాత్ర మొదలు అయ్యి తుర్కగూడ, చర్ల పటేల్ గూడ మీదుగా సాయంత్రం పాదయాత్ర ఇబ్రహీంపట్నం టౌన్ కు చేరుకుంటుంది అక్కడే పబ్లిక్ మీటింగ్ ముగించుకొని ఇబ్రహీంపట్నం మంచాల రోడ్ లో రాత్రి బస చేస్తుందని తెలిపారు. 29వ తేదీ శుక్రవారం రోజు ఉదయం ఇబ్రహీంపట్నం నుండి మొదలు అయ్యి సీతారాం పెట్ గెట్ మీదుగా మంచాల మండలం నోముల గ్రామం లింగం పల్లి గెట్ మీదుగా మంచాల గ్రామానికి చేరుకొని మంచాల గ్రామంలో ప్రజలలో రచ్చ బండ నిర్వహించి వైయస్ షర్మిల ప్రజా సమస్యలు తెలుసు కుంటారు. అనంతరం ఛంద్ ఖాన్ గూడ, అస్మాత్ పూర్  మీదుగా జపాల చేరుకుని రాత్రి బసచేస్తారు. 30తేదీ శనివారం రోజు ఉదయం జపాల గ్రామం నుండి పాదయాత్ర రంగపూర్, చిదేడ్ దాద్ పల్లి గ్రామల మీదుగా సాగిన వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాయంత్రం యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామానికి చేరుకుని రాత్రి బస చేస్తుంది. 31వ తేదీ ఆదివారం ఉదయం మొండి గౌరెల్లి నుండి చింతపట్ల, నల్లవెల్లి మీదుగా సాయంత్రం మాల్ గ్రామానికి చేరుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ0లోని ప్రజలు నిరుద్యోగులు రైతులు వివిధ సమస్య లు ఉన్న అన్ని వర్గాల ప్రజలు ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ప్రజా ప్రస్థానం పేర పాదయాత్ర చేసుకుంటూ నేను ఉన్నాను మీకు అండగా అంటూ మీ గ్రామానికి మీ గడప దగ్గరికి వస్తున్న వైయస్సార్ రక్తం మాట ఇస్తే మాట తప్పని వంశం మన రాజన్న తనాయురాలు వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల గారి పాదయాత్ర కు ప్రజలు పెద్ద ఎత్తున్న మద్దతు పలికి వైయస్ షర్మిలకు సమస్యలు చెప్పు కోవాలని. ప్రజలకు పిలుపునిచ్చారు అలాగే వైయస్సార్ అభిమానులు వైయస్సార్ పార్టీ మండలం కన్వీనర్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోన సాగె ప్రజా ప్రస్థనం పాదయాత్ర కు ప్రజలను బారి ఎత్తున పాల్గొనేలా కృషి చేసి ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం చేయాలని అన్నారు.