గుడ్ న్యూస్ స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్టమస్ వేడుకలు
Published: Saturday December 24, 2022
అశ్వరావుపేట ప్రజా పాలన (ప్రతినిధి) మండలంలోని స్థానిక గుడ్ న్యూస్ స్కూల్ పాఠశాలలో సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే పలు రకాల ఆటలు,పాటలు పాడించి అందరినీ అలరింపచేశారు. ఏసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రకు సంబంధించిన పలు కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే స్కూల్లో క్లాస్ ఫస్ట్ సెకండ్ ర్యాంకుల బహు మతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడ్ న్యూస్ స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ జోషి, ఫాదర్ టోనీ, స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ డెల్బీ, టీచర్స్, మధు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: