బిల్డింగ్ భారత్ బ్రోచర్ విడుదల.. ఆవిష్కరించిన డైరెక్టర్ రమేష్ బాబు..

Published: Wednesday August 03, 2022

తల్లాడ, ఆగస్టు 2 (ప్రజాపాలన న్యూస్):

తల్లాడ పట్టణంలోని మల్లవరం గ్రామపంచాయతీ పరిధిలోని బృందావనం వెంచర్ లో బిల్డింగ్ భారత్ రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రోచర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఆ కంపెనీ డైరెక్టర్ రమేష్ బాబు చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ ఆధారలకే ప్రధాన రహదారి పక్కన ప్లాట్లు అమ్మకాలు చేయడం జరుగుతుందని తెలిపారు. చుట్టుపక్కల వినియోగదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి సృజన్ కుమార్, సీఈఓలు అప్పారావు, కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.