రావినూతల గ్రామంలో పర్యటించిన ఎంపీ నామా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శ

Published: Tuesday October 11, 2022
బోనకల్, అక్టోబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి: టీఆర్ఎస్ ( బీఆర్ఎస్ )లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సోమవారం మండల పరిధిలోని రావినూతల గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల తో కలసి ఇటీవల మరణించిన పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా సీపీఎం జిల్లా నాయకులు యనమదల విక్రమ్ తండ్రి జోషి( 72) ఇటీవల మరణించగా వారి స్వగ్రాహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలానే వట్టికొండ రాధాకృష్ణ మూర్తి కుటుంబ సభ్యులను చేబ్రోలు రామారావు ,సీతమ్మ కుటుంబ సభ్యులను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటాలకు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీ.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లిఖార్జునరావు , గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, అంబటి సుధాకర్, సూర్యదేవర సుధాకర్ , చావా హనుమంతరావు, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ , పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు, భాగం నాగేశ్వరరావు , ఉద్దండు , సురేష్ , నరేష్ , కొండలు , గ్రామశాఖ అధ్యక్షుడు బంధం తిరుపతి , ప్రేమనందం, బాణోత్ కృష్ణ , మంగయ్య , రావూరి వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నాయకులు వై. విక్రమ్, సిపిఎం బోనకల్ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఎం ఖమ్మం వన్ టౌన్ సెక్రెటరీ జబ్బార్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ పంతులు, గుగులోత్ నరేష్ , నామ సేవా సమితి సభ్యులు చీకటి రాంబాబు , రేగళ్ల కృష్ణప్రసాద్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.