నాగన్ పల్లి చెరువులో వ్యక్తి మృతి
Published: Wednesday November 17, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : ప్రమాద వశాత్తు చెరువులో పడి వ్యక్తి మరణించిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగన్ పల్లి గ్రామానికి చెందిన మడుపు శివ తండ్రి పాండు 25 సంవత్సరాలు నాయి బ్రాహ్మణ కులానికి చెందిన శివ కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఆరోగ్యరీత్యా మూర్ఛ, చక్కర్, (ఫిడ్స్) తరచూ వస్తాయని తెలుస్తోంది. సోమవారం నాగన్ పల్లి చెరువు దగ్గరకి వెళ్లగా అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి చెరువులో మునిగి పోయి మరణించాడని గ్రామప్రజల కథనం. ఈ విషయమై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించి ఇబ్రహీంపట్నం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ బాలకృష్ణ రెడ్డి తెలియజేశారు.
Share this on your social network: