ఎడతెరపి లేని వర్షాలతో కంట్రోల్ రూమ్
Published: Tuesday July 12, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూలై 11 ప్రజా పాలన : జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించేందుకు గాను సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇంకా మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రజలకు ఏదైనా సమస్యలు తలెత్తినట్లయితే తమ సమస్యలను ఫోన్ నెంబర్ 7995061192 ద్వారా నేరుగా తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు. భారీగా వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సురక్షితంగా ఉండేవిధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాలలో తప్పిస్తే ఎవరు బయటికి రాకూడదని కలెక్టర్ సూచించారు. మండల స్థాయి అధికారులు పరిస్థితులను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలని కలెక్టర్ సూచించారు.
Share this on your social network: