జిల్లా ఉపాధ్యక్షులుగా బిక్షపతి చారి
Published: Friday February 05, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్ ; మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి నీ రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఓ బి సి (OBC) ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా బిక్షపతి చారి మాట్లాడుతూ.... బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్కా నరసింహారెడ్డి కి ఓబిసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ కి, నాకు రాజకీయ గురువు తల్లోజు ఆచారి కి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీ రాములు యాదవ్ కి, రాష్ట్ర కిసాన్మోర్చా ప్రధాన కార్యదర్శి కోలన్ శంకర్ రెడ్డికి, కీసర గోవర్ధన్ రెడ్డి పెండ్యాల నరసింహ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకంతో నా కు బాధ్యత ఇచ్చిన, నమ్మకాన్ని వమ్ము చేయకుండా బిజెపి పార్టీ బలోపేతానికి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 27 వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి .
Share this on your social network: