రామాలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన - ఎమ్మెల్యే
Published: Friday May 07, 2021
జగిత్యాల, మే 06 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ రామాలయంలో సీసీ కెమెరాలను స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో నేరాల నియంత్రణకు నేరస్తులను గుర్తించేందుకు కేసులు చేధించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సైతం ప్రజలు వ్యాపారస్తుల సహకారంతో ప్రధాన ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తోందని జిల్లా కేంద్రంలో సైతం అతి త్వరలో 100 కెమెరాలు ప్రధాన రహదారి వెంట అమరుస్తామన్నారు. రామాలయం అభివృద్ధికి ముందుకొస్తున్న దాతలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీష్ భోగ ప్రవీణ్ రామాలయం చైర్మన్ కాశెట్టి తిరుపతి కౌన్సిలర్లు నారాయణ రెడ్డి లత జగన్ పిట్ట ధర్మరాజు కుసరి అనిల్ బోయినపల్లి శరత్ అశోక్ రావు ఆలయ డైరెక్టర్లు పట్టణ సిఐ జయేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: