జూలై 3న మోడీ బహిరంగ సభను విజయవంతం చేయండి మండల బిజెపి అధ్యక్షుడు వీరపనేని అప్పారావు
Published: Monday June 27, 2022
బోనకల్ ,జూన్ 26 ప్రజాపాలన ప్రతినిధి:తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బిజెపి రాష్ట్ర పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు బిజెపి పాలిత 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ మహా సభకు మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు బిజెపి అభిమానులు అందరూ జూలై 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
Share this on your social network: