చెరువులో పడి మృతిచెందిన కోట సందయ్య కుటుంబానికి జాంబవవారసుల ఆర్ధిక చేయూత

Published: Tuesday February 23, 2021

ప్రజాపాలన ఫిబ్రవరి 22: ఇటీవల మధిర చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన కోట సందయ్య కుటుంబానికిజాంబవవారసులం గ్రూపు సభ్యులు ఆర్ధిక తోడ్పాటు అందించారు. పేరెల్లి. శ్రీను, మరికంటి.కన్నారావు, కేదాస్.కృష్ణ, పెనుగూరి.కోటేశ్వరరావు లతో పాటు ఇంకా కొందరు కలిసి ఖమ్మం జిల్లాలో జాంబవవారసులం పేరుతో ఓ ఫౌండేషన్ ఏర్పాటుచేసి జిల్లాలో ఆపన్నులకు తోడ్పాటు అందిస్తున్నారు,దానిలో భాగంగా కోట.సందయ్య చెరువులో జారిపడి మరణించిన విషయాన్ని కోట.రాకేష్ ద్వారా తెలుసుకున్న గ్రూపు సభ్యులు ఈరోజు సందయ్య కుటుంబానికి 32,766/- రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ ఆటో కన్సల్టెన్సీ కోటపర్తి.తిరుపతిరావు, ముస్కుడి.లాలిబాబు, భీమవరం మాజీ ఎంపీటీసీ కోట.లోకేష్, చింతిరాల.ప్రభాకర్, జర్నలిస్టులు నాగరాజు, రాజేష్ లు పాల్గొన్నారు.