ఖబర్దార్ గుండాలరా మా జోలికొస్తే భూస్థాపితం చేస్తాం
Published: Tuesday February 08, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 7 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న సాయంత్రం సభ్యత్వ నమోదు చేస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు వంగల బుగ్గ రాములు పై దాడి చేసి గాయపరిచారు, ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఇబ్రహీంపట్నం లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని పరామర్శించి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు.
Share this on your social network: