ఖబర్దార్ గుండాలరా మా జోలికొస్తే భూస్థాపితం చేస్తాం

Published: Tuesday February 08, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 7 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం  మంచాల మండలం చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న సాయంత్రం సభ్యత్వ నమోదు చేస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు వంగల బుగ్గ రాములు పై దాడి చేసి గాయపరిచారు, ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఇబ్రహీంపట్నం లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని పరామర్శించి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు.