సిపిఎం పార్టీ సానుభూతి పరు రాలు మృతి.....

Published: Saturday January 29, 2022

ఎర్రుపాలెం జనవరి 28 ప్రజా పాలన ప్రతినిధి: ఇటీవల కొద్దిరోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతూ సిపిఎం పార్టీ గ్సానుభూతి పరురాలు శుక్రవారం తెల్లవారుజామున తన స్వగృహమునందు మృతి చెందారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం గ్రామానికి చెందిన షేక్ జాన్ బి (72) మృతి చెందిన వార్త తెలియగానే సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య మృతదేహాన్ని సందర్శించి పార్టీ సభ్యులతో కలిసి ఆమె పార్థివ దేహం పై  సిపిఎం పార్టీ జెండాను కప్పి నివాళులు అర్పించారు. ఆమెకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు షేక్ బాబు జానీ గ్రామ శాఖ పార్టీ సభ్యుడని వీరయ్య తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో  గొల్లపూడి కోటేశ్వరరావు, నల్లమోతు హనుమంతరావు, అనుమోలు వెంకటేశ్వరరావు, నారాయణ రెడ్డి, గొల్లపూడి శ్రీహరి నారాయణ, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.