పేకాట, కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం : ఎస్సై సతీష్

Published: Friday January 14, 2022

మధిర జనవరి 13 ప్రజా పాలన ప్రతినిధి : మధిర పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. టౌఎస్ఐ సోమ సతీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాము. పేకాట, కోడిపందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కావున మధిర మండల ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని కోరుచున్నాము