రోడ్లు ఊడిచి నిరసన తెలిపిన వీఆర్ఏలు

Published: Thursday August 04, 2022
బోనకల్, ఆగస్టు 3 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు మండల వీఆర్ఏలు సమ్మె బుధవారం తో 10వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా వీఆర్ఏలు వీధుల్లో రోడ్లు ఊడిచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ, గతంలో అసెంబ్లీలో, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, సీఎం హామీ ఇచ్చి దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇంతవరకు హామీలను అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు సమ్మె చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు ఎం సుధాకర్, కార్యదర్శి కిరణ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకట్, జిల్లా కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, వీఆర్ఏలు,రంజిత జానకి, కోటేశ్వరి, నాగేంద్ర, నాగలక్ష్మి, విష్ణు, లాజర్ లు పాల్గొన్నారు.