ఆత్మీయులకు ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

Published: Thursday June 03, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కరోనా మహమ్మారికి గురై ప్రాణాలు కోల్పోయిన రాజిరెడ్డి, శ్రీశైలం యాదవ్, రాజు గౌడ్ లా ఆత్మశాంతి కొరకై మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, రాష్ట్ర బిజెపి సీనియర్ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి గంగాధర్ రెడ్డి, రాష్ట్ర బీజేవైఎం కోశ అదికారి మారబోయిన రఘునాథ్ యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంతు నాయక్, మాదాపూర్ బిజెపి కాంటెస్ట్ అభ్యర్థి రాధా కృష్ణ యాదవ్ ఇతర బిజెపి సీనియర్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ స్వగృహంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను కోల్పోయామని, వారి కుటుంబాలు మనోధైర్యం కోల్పోకుండా ధైర్యం ఉండాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కరోనా అనే కనిపించని మహమ్మారితో పోరాడుతున్నము ప్రతి కార్యకర్త, సీనియర్ నాయకులు ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, శ్రీశైలం, రంగస్వామి, రమేష్, ప్రకాష్, విష్ణు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.