ఎమ్మెల్యే డా.సంజయ్ ను కలిసిన పట్టణ టీఆరెస్ రైతు విభాగం కార్యవర్గం

Published: Monday October 11, 2021
జగిత్యాల, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): నూతనంగా ఎన్నికైన జగిత్యాల పట్టణ టీఆరెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు బండారు నరేందర్, నూతన కార్యవర్గం ఆదివారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేచినారు. ఎమ్మెల్యే నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, కౌన్సిలర్లు మల్లికార్జున్, కుతురు రాజేశ్, నాయకులు దావా సురేష్, కూతురు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.