అంబేద్కర్ రాజ్యాంగంతోనే ఎమ్మెల్యే పదవి.. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య..

Published: Friday December 02, 2022
తల్లాడ, డిసెంబర్ 1 (ప్రజా పాలన న్యూస్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తాను ఎమ్మెల్యేగా ఈ పదవిలో ఉన్నానని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. గురువారం నారాయణపురంలో నూతనంగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఇటువంటి వాటిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఎంతో దూరదృష్టితో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్  చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పిటిసి దిరిశాల ప్రమీల, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు  వీర మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, సర్పంచ్ నారపొగు వెంకట్, సంగసాని శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.