అంబేద్కర్ రాజ్యాంగంతోనే ఎమ్మెల్యే పదవి.. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య..
Published: Friday December 02, 2022
తల్లాడ, డిసెంబర్ 1 (ప్రజా పాలన న్యూస్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తాను ఎమ్మెల్యేగా ఈ పదవిలో ఉన్నానని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. గురువారం నారాయణపురంలో నూతనంగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఇటువంటి వాటిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఎంతో దూరదృష్టితో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పిటిసి దిరిశాల ప్రమీల, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీర మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, సర్పంచ్ నారపొగు వెంకట్, సంగసాని శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: