మినీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి

Published: Thursday December 22, 2022
మేడిపల్లి, డిసెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చ్  వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ సీనియర్ పాస్టర్ బొంత శామ్యూల్ సజన్ కుమార్ ఆహ్వానం మేరకు మినీ క్రిస్మస్ వేడుకల్లో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డిని న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చ్ సభ్యులు శాలువాతో సన్మానించినారు. అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ, న్యూ బాప్టిస్ట్ చర్చ్ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటారని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో
న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చ్ సభ్యులు గుండం మధు, శేఖర్, మేడ్చల్ మల్కాజ్గిరి ఎస్టీ సెల్ చైర్మన్ గణేష్ నాయక్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంజలి సంతోష్, ఉప్పల్ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ నరేష్, కిషన్ నాయక్, రమేష్ నాయక్, సాయిబాబా, శ్రావణ్, బొల్లు వెంకట్, పవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.