టీఆర్ ఏస్ విస్తృతస్థాయి సమావేశానికి జయప్రదం చేయండి
Published: Wednesday October 27, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సన్నాహక సమావేశం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మన్నెగూడ వేద ఫంక్షన్ హాల్ లో బుధవారం జరుగుతున్నందున తెరాస రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ , తెరాస రాష్ట్ర యువ నేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటీ) తో పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతున్నారని ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గ రాములు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి భారీ ఎత్తున నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సేనలు హాజరుకావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, ఆయా గ్రామాల పార్టీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పార్టీ అనుబంధ సంఘాల శ్రేణులు, మహిళా నాయకులు, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా పెద్ద ఎత్తున హాజరు కాగలరని తెలిపారు.
Share this on your social network: