గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు

Published: Thursday July 08, 2021
పటాన్చేరు, జులై 07, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణంలో అమరవీరులస్తూపం దగ్గర గత నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి సుమారు 25సం నుంచి 30సం వయస్సు శవం ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందిందని.వ్యక్తి వివరాల కోసం విచారణ జరపగా ఎటువంటి వివరాలు అందలేదు. గుర్తు తెలియని శవాన్ని అంత్యక్రియలు జరపడం కోసం యండిఆర్ ఫౌండేషన్ ను సంప్రదించగా సామాజిక సేవలో భాగంగా మా బాధ్యతగా భావించి టిఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు సహకారంతో అంత్యక్రియలు నిర్వహించామన్నారు