నూతన అధ్యక్షులుగా రాజశేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం..

Published: Tuesday July 26, 2022
తల్లాడ, జులై 25 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా దగ్గుల రాజశేఖర్ రెడ్డి ఆదివారం రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు కార్యదర్శిగా వేమిరెడ్డి నారాయణ రెడ్డి, కోశాధికారిగా అనుమోలు సర్వేశరరావు  ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ లో సేవా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. క్లబ్ సభ్యుల సహకారంతో ప్రజలకు సేవలు చేస్తామన్నారు. అనంతరం పలువురు పేద మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు కర్నాటి లక్ష్మారెడ్డి, ఉండ్రు శ్యాంబాబు, లగడపాటి, మిట్టపల్లి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.