ప్రజావాణి సమస్యలకు 151 ఫిర్యాదులు

Published: Tuesday September 13, 2022
 జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్ 
వికారాబాద్ బ్యూరో 12 సెప్టెంబర్ ప్రజా పాలన : ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈరోజు ప్రజల నుండి వివిధ సమస్యలపై 151 ఫిర్యాదులు అందినట్లు జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్ తెలిపారు.  ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి,  అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.