పోడు భూములకు సర్వేకు పోడు సాగుదారులందరూ సహకరించాలి. సారపాక గ్రామసభలో తిరుపతి ఏసోబు.
Published: Saturday November 26, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
పోడు సాగు చేసుకున్నటువంటి రైతులందరూ కూడా తోడుబొమ్మల సర్వేకి వచ్చేటువంటి అధికారులకు మరియు ఫారెస్ట్ అధికారులకు సహాయ సహకారాలు అందించి సర్వే సక్రమంగా జరిగేలా చేయాలని చూడాలని బిఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల సారపాక పట్టణ కార్యదర్శి తిరుపతి ఏసోబు గ్రామసభలో సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పోడు సాగుదారుడికి ప్రభుత్వం పట్టా ఇచ్చేందుకు సర్వేలు నిర్వహిస్తుందని దానిలో భాగంగానే ఈరోజు సారపాక పట్టణంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందని వారు తెలిపరు. ఈ గ్రామ సభలో ఈవో మహేష్, రెడ్డిపాలెం సర్పంచ్ ఝాన్సీ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this on your social network: