ఎంపీ, ఎమ్మెల్యేను కలిసిన కొణిజర్ల బీఅర్ఎస్ నేతలు

Published: Wednesday February 22, 2023
కొణిజర్ల, ఫిబ్రవరి 21 (ప్రజా పాలన న్యూస్): ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుని,  వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ని కొణిజర్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం ఖమ్మంలోని కలిసి మండలంలోని పలు సమస్యలను వారికి వివరించారు. తక్షణమే అట్టి సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు దొడ్డపనేని రామారావు, తాళ్లూరు చిన్న పుల్లయ్య, మండల మాజీ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు, సుడా డైరెక్టర్ బండారి కృష్ణ, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు బూర ప్రసాద్,ఎంపిటిసిలు దొడ్డపనేని లలిత కుమారి తేజవత కుమారి సర్పంచులు రోషన్ బేగ్ రంగ సత్యనారాయణ అద్దంకి చిరంజీవి మూడు సురేష్ మార్కెట్ డైరెక్టర్ ధరావత్ బాబులాల్ మండల యూత్ అధ్యక్షుడు వాడిత్యా రంగారావు తదితరులు పాల్గొన్నారు.