ఆదర్శ పాఠశాలలో 6,7,8,9,10 తరగతులకు దరఖాస్తులు ఆహ్వానం - ప్రిన్సిపాల్ కట్ల శ్రీనివాస్

Published: Thursday April 01, 2021

వెల్గటూర్, మార్చి 31 (ప్రజాపాలన ప్రతినిధి)  : వెల్గటూర్ మండలం కుమ్మర పల్లె ఆదర్శ పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 10 తరగతులలో మిగిలిపోయిన సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కట్ల శ్రీనివాస్ బుధవారం రోజు ఒక ప్రకటనలో విద్యా సంవత్సరానికి గాను 15-4-2021 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ.సి, ఎస్.సి, ఎస్టీ విద్యార్థులకు 75 రూపాయలు మిగతా విద్యార్థులకు 150 రూపాయల దరఖాస్తు రుసుము ఉంటుందని ఆయన తెలియజేశారు. 7 8 9 10 తరగతులకు ప్రవేశ పరీక్ష 5--6--3021ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు నిర్వహిస్తామని అదేవిధంగా ఆరో తరగతి ప్రవేశ పరీక్ష 6-6-2021 ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30-4--2021 అని ప్రిన్సిపాల్ఆ యన తెలిపారు. ఉత్సాహవంతులు ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు వినియోగించుకోవాలని శ్రీనివాస్ తెలియజేశారు.