నారాయణ్ ఖేడ్ 29 జులై ప్రజాపాలన: పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.జోగారెడ్డి కి ఘన సన్మాన

Published: Saturday July 30, 2022

పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయానికి తొలిసారిగా విచ్చేసిన మెదక్ రీజియన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.జోగారెడ్డిని నారాయణ్ ఖేడ్ మరియు సిర్గాపూర్ సబ్ డివిజన్ ఆద్వర్యంలో ఘనంగా సత్కరించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.కొండయ్య, అసిస్టెంట్ ఇంజనీర్లు జి.మాధవనాయుడు, రాకేశ్ కుమార్, వెంకటేశ్వర్ రెడ్డి లు జూనియర్ టెక్నీకల్ అధికారులు నర్సింహా,సాయగౌడ్ మరియు కార్యాలయ సిబ్బంది కాంట్రాక్టర్ లు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తదుపరి పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు.