రైతులకు భూమి దక్కేఅంతవరకు పోరాటం చేస్తాం
Published: Friday September 24, 2021
ఇబ్రహీంపట్నం తేదీ సెప్టెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట్ మండల పరిధిలో బండ రావిరాల గ్రామం మైనింగ్ జోన్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తొమ్మిది రోజులుగా చేస్తున్న దీక్షకు మద్దతుగా గురువారం రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాజీ ఎమ్మెల్సీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య. సిపిఎం మండల కార్యదర్శి ఈ నరసింహ, న్యాయవాది అరుణ్ కుమార్, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కిషన్, భాస్కర్ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు గుండె శివ కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రకాష్ కరత్ మల్లేష్ గురువారం రోజు దీక్షలో పాల్గొని రైతులకు నష్టపరిహారం వచ్చేంతవరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని మీ పోరాటంలో ముందు బాగానే ఉంటుందని తమ్మినేని వీరభద్రం అన్నారు.
Share this on your social network: